ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందులలో తుపాకీ కాల్పులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 11:22 AM

పులివెందుల (కడప) : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో తుపాకీ కాల్పులు కలకలాన్ని రేపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో వైసిపి కి చెందిన రెండు కుటుంబాలున్నాయి. పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్‌ రెడ్డి (62) ఇద్దరూ బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ప్రసాద్‌ రెడ్డి ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు. తనను చంపుతాడేమోనన్న ఆందోళనలో ప్రసాద్‌ రెడ్డి (కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్‌ తుపాకీతో పార్థసారధి రెడ్డి పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మఅతి చెందాడు. అనంతరం అదే తుపాకీతో ప్రసాద్‌ రెడ్డి కూడా తన లైసెన్సు రివాల్వర్‌ తో తనను తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com