కడప: దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎనిమిదవ రోజుకు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతోంది. పులివెందులకు చెందిన క్రిష్ణయ్య అనే వ్యక్తి ఈరోజు విచారణకు హాజరయ్యారు. అలాగే పులివెందులకు చెందిన మరి కొంతమంది అనుమానితులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.