ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాఖండ్‌లో 8వేల కిలోల చరాస్‌ పట్టివేత

national |  Suryaa Desk  | Published : Sun, Jun 13, 2021, 03:19 PM

ఉత్తరాఖండ్‌లో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉధమ్ సింగ్‌నగర్‌లోని కిచా పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో రెండు కార్లలో తరలిస్తున్న 8వేల కిలోలకుపైగా చరాస్‌ను పట్టుకోవడంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక కారులో 1,094 కిలోల చరాస్‌, మరో కారులో 6,914 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వారిద్దరినీ పిథోర్గఢ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. చరాస్‌ తరలించేందుకు వినియోగించిన రెండు వాహనాలను సీజ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com