ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనందయ్య కరోనా మందుపై వివరాలు సేకరిస్తున్న ఆయుష్ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 22, 2021, 09:12 PM

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై నిగ్గు తేల్చేందుకు ఆయుష్ వర్గాలు రంగంలోకి దిగాయి. మందుపై శాస్త్రీయ అధ్యయనం జరిగాకే పంపిణీ అంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, లోకాయుక్త కూడా ఈ అంశంలో ప్రవేశించింది. ఆనందయ్య కరోనా మందుపై ఈ నెల 31న విచారణ జరపనుంది. అటు, కృష్ణపట్నంలో పర్యటిస్తున్న ఆయుష్ అధికారులు ఆనందయ్య నుంచి మందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని ఆనందయ్య అధికారులకు వివరించారు. ఈ క్రమంలో ఆనందయ్యకు పూర్తిస్థాయిలో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com