ప్రస్తుత సమాజంలో పనిచేసే చోట మహిళలకు రక్షణ కరువైంది. వేధింపులు, చీత్కారాలను ఎదుర్కొంటూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.తన దగ్గర పనిచేస్తున్న యువతిని సోదరిలా చూసుకోవాల్సిన యజమాని దారి తప్పాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. లాక్ డౌన్ కావడంతో కాలేజీ మూతపడింది. ఈ సమయంలో ఇంటికి అండగా ఉండాలనే భావనతో ఓ దుకాణంలో నెలకు రూ.5వేల జీతానికి పనిచేస్తోంది.ఇదే అదునుగా భావించిన షాపు ఓనర్ ఆమెపై కన్నేశాడు. షాపులో ఎవరూ లేని సమయం చూసి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకోగానే.. అత్యాచారానికి పాల్పడ్డాడు.మత్తునుంచి తేరుకున్న తర్వాత తనపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకున్న బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పొన్నూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.