దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ప్రాణాలు తీస్తోంది. తాజాగా తమిళనాడు చెంగల్ పట్టు ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ఐదు గంటల ముందే ఆక్సిజన్ లేదని బాధితులు మొత్తుకున్నా వైద్యులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా వైద్యులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని, ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పారు. మరణించిన మృతుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషాదంతో బంధువుల ఆక్రందనలు మిన్నంటాయి. పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. వెంటనే ఆక్సిజన్ సమకూర్చకపోతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.