ఏపీలో కరోనా పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, మందులు, వ్యాక్సినేషన్ పై సమగ్ర విచారణతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆక్సిజన్ నిల్వలపై ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కేసులకు సరిపడా బెడ్లు, సౌకర్యాలపై హైకోర్టు ఆరా తీసింది. టెస్టుల రిపోర్టులు ఎంత సమయంలో ఇస్తున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఎంత వ్యాక్సిన్ ఉంది.. ఎంత మందికి వ్యాక్సిన్ వేశారో తెలియజేయాలంది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.