ఏపీలోని శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. నేటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 30 శాతం కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కలెక్టర్ కోరారు.