ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. శ్రీకాకుళం టౌన్ లో కరోనా వ్యాప్తి దృష్ట్యా రేపటి నుంచి సెల్ఫ్ లాక్ డౌన్ పాటించాలని నిర్ణయించారు. వ్యాపార వర్గాలు స్వచ్చంధంగా ముందుకు వచ్చిన ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత నిత్యావసరాలు మినహా అన్ని వ్యాపారాలు బంద్ చేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్లలో రేపటి నుంచి రోజుకు 2 షో లనే వేయనున్నారు. మార్నింగ్ షో, మ్యాట్నీ షోల వరకే సినిమా హాళ్లు పరిమితం చేసేందుకు థియేటర్ల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. అయితే, శ్రీకాకుళం టౌన్ లో ఆదివారం రోజున పూర్తిగా లాక్ డౌన్ పై నిర్ణయాన్ని ఆ జిల్లా కలెక్టర్ జె.నివాస్ వ్యాపారవర్గాలకే వదిలేశారు. దీనిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.