హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవ్ జరిగిన విషయం తెలిసిందే. దీన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఖండించారు. ఎక్కడా వైరస్ టెస్టులు జరగడం లేదని, ఎక్కడా హాస్పిటళ్లలో బెడ్లు లేవని, ఎక్కడా వెంటిలేటర్లు లేవని, ఆక్సిజన్ కూడా ఎక్కడా అందుబాటులో లేదని, వ్యాక్సిన్లు కూడా లేవని రాహుల్ తన ట్విట్టర్లో విమర్శించారు. రోగులకు ఏవీ అందుబాటులో లేవు కానీ ఉత్సవ్ మాత్రం నిర్వహిస్తున్నారని విమర్శించారు. పీఎం కేర్స్ నిధులు ఏమైనట్లు రాహుల్ తన ట్వీట్లో ప్రశ్నించారు.