నెల్లూరు: గత ఎన్నికల్లో డబ్బులు, బెదిరింపులతో వైసీపీ గెలిచిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఇటువంటి మాఫీయాను చూడలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఓటుతో వైసీపీని భూస్థాపితం చేయాలని చెప్పారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కరోనా సాకుతో జగన్ తిరుపతి సభను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. బాబాయ్ని ఎవరు చంపారో చెప్పలేని అసమర్థుడు ఈ జగన్రెడ్డి అని విమర్శించారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.