తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగరంలో త్రాచు పాము హల్ చల్ చేసింది. స్థానిక కచేరిపేట బులుసురెడ్డి వారి వీధిలో బుధవారం త్రాచు పాము కలకలం సృష్టించింది. స్థానికంగా ఉండే ఒక ఇంట్లోకి 15 అడుగుల పాము వెళ్లడంతో ఇంట్లో నుంచి జనాలు పరుగులు తీశారు. దీంతో పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి త్రాచు పామును పట్టుకున్నారు.