అమరావతి: షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి విప్లవవీరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గౌరవవందనం సమర్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ''యువశక్తికి, దేశభక్తికి తమ జీవితాలనే నిర్వచనంగా చెప్పిన ధన్యజీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వేఛ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. షహీద్ దివస్ సందర్భంగా ఆ విప్లవవీరులకు గౌరవవందనం సమర్పిద్దాం'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.