వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మద్యాన్ని సేవిస్తున్నారు.. యువత పార్టీలని , పబ్ లు అంటూ వ్యసనాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటికి ప్రభుత్వం దండన ఇస్తూ వస్తుంది. యువత చెడు వ్యసనాల కు బానిస కాకుండా వయసు పరిమితి పెట్టింది. ఆ వయసు దాటిన వారే మద్యాన్ని సేవించాని షరతు పెట్టింది. వాటికి యువత కట్టుబడి ఉండలేదని ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని యువకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగరం లో మద్య పానానికి చట్టబద్ధమైన వయస్సును ఢిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయస్సు 25 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీల్లీ కేబినెట్ కొత్త మద్యం పాలసీని ఆమోదించిందన్నారు. ఈ కొత్త విధానం లో ఆప్ సర్కార్ చేసిన పలు మార్పుల్లో భాగంగా వయస్సు ను కుదించారు. తక్కువ వయసు కలిగి ఉన్నా కూడా లిమిట్ లో తాగాలని పేర్కొంది.
ఈ పాలసీ ప్రకారం.. ఢిల్లీ నగరం లో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని.. అలాగే, మద్యం దుకాణాలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు తెలిపారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మద్యం తాగే వయస్సును 21కి మార్చాలని సిఫారసు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నగరం లోని 60శాతం లిక్కర్ దుకాణాలు ప్రభుత్వ నిర్వహణ లో ఉన్నాయని సిసోడియా తెలిపారు.. మొత్తానికి యువతకు ఆ విషయం లో క్లియరెన్స్ దక్కింది.. చాటుగా తాగడం ఎందుకు 21 ఏళ్లు ఉన్న వాళ్ళు ఎక్కడైనా తాగొచ్చు.. ఇలాంటి నిబంధన తెలుగు రాష్ట్రాల్లో వస్తే బాగుండునని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు.