ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని గొల్లకంచిలిలో పోలీసులు భారీగా నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గొల్లకంచిలిలోని ఓ ఇంట్లో బాంబులు, కర్రలు, గాజు పెంకులు నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకే ఈ బాంబులు సిద్ధం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొల్లకంచిలికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు.