ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ కి గుడ్ బై చెప్పిన భారత ఆల్ రౌండర్..

national |  Suryaa Desk  | Published : Fri, Feb 26, 2021, 05:27 PM

భారత ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 38ఏళ్ల వయసులో క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆలౌ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ్ముడైన యూసఫ్ పఠాన్ టీమిండియాలో కీలక ప్లేయర్ గా కొనసాగాడు. టీమిండియా తరపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్ 810 పరుగుుల చేశారు. 33 వికెట్లు పడగొట్టాడు. వీటిలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి. మరోవైపు 22 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ లలో 236 పరుగులతోపాటు 13 వికెట్లు తీశాడు. 2007 టీ 20 వరల్డ్ కప్ లో, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. న్యూజిలాండ్ పై, సౌతాఫ్రికాపై జరిగిన మ్యాచుల్లో వీరోచితంగా పోరాడాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com