ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలలో 96 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,169కి చేరింది. అదే సమయంలో 71 మంది రికవరీ అయ్యారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 8,81,877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 635 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్లో పేర్కొంది.