ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి భగ్గుమన్న చమురు ధరలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 26, 2021, 11:19 AM

దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు 35 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.51 కి చేరింది. లీటర్ డీజిల్ రూ. 83.19 గా ఉంది. వరంగల్ ‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.06 కాగా డీజీల్‌ 82.75 గా ఉంది.
ఏపీలోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 91.88 గా ఉంది. డీజీల్‌ రూ.85.09గా నమోదైంది. గుంటూరులో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.92.09 కి చేరగా.. డీజీల్‌ ధర రూ. 85.26గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.10 కాగా.. డీజిల్ రూ. 84.31కు చేరింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 86.05 కి చేరింది. డీజిల్ ధర రూ.76.23 కి పెరిగింది. ముంబైలో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 92.62 ఉండగా డీజీల్‌ రూ.83.03గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.60 ఉండగా డీజీల్‌ ధర రూ. 81.47 గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com