క్షుద్రపూజలు పేరుతో కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పురుషోత్తం నాయుడు- పద్మజ దంపతులకుకు ఇద్దరు ఆడపిల్లలు దివ్య(22), అలైఖ్య (27), ఎంబీఏ విద్య పూర్తి చేశారు. తల్లి తండ్రులకు క్షుద్రపూజలుపై ఆసక్తి అధికంగా ఉండటంతో కన్న బిడ్డలు పైనే వారు క్షుద్ర పూజలు ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు ఆడపిల్లలు పైనే వారు క్షుద్రపూజలు పేరుతో కిరాతకంగా దారుణహత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జంట హత్యలు పట్టణంలో కల కలం రేపింది.