తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 49,346 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 18,436 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత శ్రీవారిని ఇంత పెద్ద మొత్తంలో దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.