ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుందని తెలుస్తోంది. సీఎస్ ఆదిత్యానాథ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు దీనికి సంబంధించి లేఖ రాశారాని సమాచారం. మంగళవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తో సీఎస్ ఆదిత్యానాథ్ భేటి అయ్యే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి అవకాశం లేకపోవడంతో సర్కార్ ఎన్నికలకు సిద్దమైందని సమాచారం. ఫిబ్రవరి 9,13,17,21 తేదీలలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సీఎం జగన్ తన క్యాంపుకార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు,డీజీపీ,ఏజీలతో సమావేశమయ్యారు. ఎన్నికల పై మరి కాసేపట్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ.
జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు.
ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన.
ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన.
ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం.
ఫిబ్రవరి 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
ఫిబ్రవరి 9న పోలింగ్(ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు).
ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.