ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఎస్ఈసీ అప్పీల్పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించగా.. కొవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే.