ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో రాష్ట్ర బీజేపీ నాయకులు సోము వీర్రాజు భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడతో సోము వీర్రాజు సమావేశమయ్యారు. ఈ భేటి అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను, తాజా పరిస్థితులపైనే తామిద్దరం చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని... ఈ నేపథ్యంలో జనసేన, బిజెపి కలిసి పనిచేయడం జరిగుతుందన్నారు. తన అభిప్రాయాలను ముద్రగడకు తెలియజేశానని వీర్రాజు పేర్కొన్నారు.