కరోనా ఇన్ఫెక్షన్లు, మరణాలతో జర్మనీలోని మైసెన్ నగరం శవాల దిబ్బగా మారింది. నగరంలో ఉన్న శ్మశాన వాటిక పరిసరాల్లో రోడ్ల పక్కన శవ పేటికలు, సేఫ్టీ కవర్లలో ప్యాక్ చేసిన మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మృతదేహాల దహనానికి ఎక్కువ సమయం పట్టడం వల్లే శవాలు పేరుకుపోయాయని శ్మశానవాటిక నిర్వాహకుడు తెలిపారు. మలేసియాలో కేసులు పెరగడంతో ప్రభుత్వం 8 నెలల ఎమర్జెన్సీ విధించింది. అయితే విపక్షాలు, విద్యావంతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.