ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్యులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ రూల్స్ చేంజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 30, 2020, 11:48 AM

డిసెంబర్ నెల కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రూల్స్ కొన్ని మారుతున్నాయి. ఈ రూల్స్ సామాన్యులను ప్రభావితం చేసేవే. అందుకే ఈ రూల్స్ తెలుసుకోండి.
1.కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త గైడ్ ‌లైన్స్‌ ని ప్రకటించింది. ఈ నియమనిబంధనలు డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. డిసెంబర్ నెలాఖరు వరకు ఇవే రూల్స్ కొనసాగుతాయి.
2.స్పెషల్ ట్రైన్స్ చాలా వరకు నవంబర్ 30 వరకే నడుస్తాయని భారతీయ రైల్వే గతంలోనే ప్రకటించింది. వీటిలో కొన్ని రైళ్లను కొన్ని రోజులు పొడిగించింది. ఆ జాబితాను కూడా విడుదల చేసింది.
3.మనీ ట్రాన్స్ ‌ఫర్ చేయడానికి ఉన్న పద్ధతుల్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ఒకటి. భారీగా లావాదేవీలు జరిపేవారికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది. డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి.
4. స్టాండర్డ్ ఇండివిజ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. 2021 జనవరి 1 నుంచి 'సరళ్ జీవన్ బీమా' పేరుతో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని చెప్పింది. అయితే అంతలోపే పాలసీని రూపొందిస్తే ఐఆర్‌డీఏఐ ఆమోదం పొందిన తర్వాత కంపెనీలు పాలసీని అమ్మొచ్చు. అంటే డిసెంబర్‌లోనే 'సరళ్ జీవన్ బీమా' పాలసీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
5. ఇండిగో ఎయిర్ ‌లైన్స్ ఆంధ్రప్రదేశ్‌ లో డిసెంబర్ 1 నుంచి రెండు ఫ్లైట్లను నడపనుంది. విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఈ ఫ్లైట్స్ నడుస్తాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది. విశాఖటప్నంలో మధ్యాహ్నం 3.15 గంటలకు ఫ్లైట్ బయల్దేరి విజయవాడకు సాయంత్రం 4.25 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 12.05 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.50 గంటలకు ఫ్లైట్ బయల్దేరి సాయంత్రం 6.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
6. మీరు ఐదేళ్లపాటు పాలసీ ప్రీమియం చెల్లించారా? అయితే ప్రీమియం 50 శాతం తగ్గించుకోవచ్చు. సగం ప్రీమియం చెల్లించినా ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ వెసులుబాటు డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
7. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి రోజు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. ఒకటో తేదీని ప్రకటించిన ధరలే ఆ నెలంతా అమలులో ఉంటాయి. డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌ లో క్రూడ్ ఆయిల్ ధరలపై గ్యాస్ సిలిండర్ల ధరలు ఆధార పడి ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com