పాకిస్తాన్ క్రికెటర్లను కరోనా గండం వేధిస్తోంది. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా క్రికెటర్లపై పంజా విసిరింది. నాడు ఆరుగురు క్రికెటర్లు కరోనా బారినపడ్డారు. ఇకపోతే తాజాగా న్యూజిలాండ్ టూర్ కి వెళ్లిన పాకిస్తాన్ కి చెందిన ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పాక్ జట్టు ప్రస్తుతం క్రైస్ట్ చర్చ్ లో ఐసోలేషన్ లో ఉందని కివీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపింది. ఇకపోతే ఈ టూర్ లో పాక్ న్యూజిలాండ్ తో3 టీ 20లతోపాటు రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. సిరీస్ ప్రారంభం కాబోతుంది అనగా క్రికెటర్లు కరోనా బారనపడటంతో సిరీస్ పై అనుమానాలు నెలకొన్నాయి.