తిరుమల శ్రీవారిని ఆదివారం 32,640 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టిటిడి తెలిపింది . ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ .2.26 కోట్లు వచ్చింది . 10,946 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు . కాగా .. కార్తీకమాసం సందర్భంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని టిటిడి అధికారులు పేర్కొన్నారు .