ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతానం కోసం అమానుషం...

national |  Suryaa Desk  | Published : Sun, Nov 22, 2020, 11:46 AM

సంతానం కోసం వందలాది మంది మహిళలు బోర్లా పడుకుని పూజారులు, మంత్రగాళ్లతో తొక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధాయి జాతరకు ప్రతి ఏడాది వేలాది మంది తరలివస్తారు. అంగామోతి మాత దేవాలయం వద్ద ఈ జాతర జరుగుతుంది.


కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ ఈ సారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలన్నింటినీ గాలికి వదిలేశారు. పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారని అక్కడ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి తాను మహిళల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తానని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్యయి నాయక్ తెలిపారు.


మహిళలపై కొందరు పురుషులు అలా నడుచుకుంటూ వెళ్లడం సరికాదని చెప్పారు. వారి మత విశ్వాసాలు దెబ్బతినకుండానే తాము త్వరలో అవగాహన కల్పిస్తామని అన్నారు. 52 గ్రామాల నుంచి తరలివచ్చిన  దాదాపు 200 మంది మహిళలు నేలపై బోర్లా పడుకుని ఉండగా పదుల సంఖ్యలో పూజారులు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అమ్మవారికి సమర్పించడానికి వారు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి తీసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com