ప్రకాశం జిల్లా గిద్దలూరులో వాహనదారులు జాగ్రత్త వహించాలని డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి సూచించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పొగమంచు రహదారులను కమ్మేస్తు ఉంటుందని, నల్లమల అటవీ ప్రాంతంలో అధిక రహదారి మలుపులు ఉన్నాయి. దీంతో పాటు అమరావతి అనంతపురం జాతీయ రహదారి పనులు జరుగుతూ ఉండడాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు వేగంగా వెళ్లకుండా వేగాన్ని నియంత్రించుకుంటూ జాగ్రత్తగా తమ గమ్యస్థానానికి కి చేరుకోవాలంటూ వాహనదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు