ఏపీలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
దీంతో వెంటనే ఆయన తన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దూలం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో గత 10 రోజులుగా తనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు, అనుచరులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.