ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలకు విచ్చేయవలసిందిగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది. శనివారం ఉదయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ సుభుదెంద్రతీర్థ స్వామీజీ, ఫోన్ చేసి ఆహ్వానించారు. మఠాధిపతి తరఫున శ్రీ నరసింహమూర్తి వచ్చి శ్రీ పవన్ కల్యాణ్ గారికి ఆహ్వాన పత్రిక, శ్రీ రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు