తన పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడనే అనుమానంతో సొంత అన్ననే హత్య చేశారు తమ్ముళ్లు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా హిర మండలం పిండ్రువాడ కాలనీలో ఈ దారుణం జరిగింది. పెద్ద నాన్న కొడుకు కరణం తిరుపతిరావు తమకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డు కుంటున్నాడని అతనిపై కర్రలతో దాడి చేశారు చిన్నాన్న కొడుకులు కరణం కాశీ, కరణం సత్యలు. అయితే తీవ్ర గాయాలు కావడంతో తిరుపతిరావు అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే మధ్యలో అడ్డుకోవడానికి వెళ్ళిన కరణం తిరుపతి రావు అతని తోడల్లుడికి గాయాలు అయ్యాయి. తన భర్త కరణం తిరుపతి రావును తన మరుదులు కరణం కాశీ, కరణం సత్య కలిసి కర్రలతో కొట్టి చంపారని మృతుని భార్య సత్యవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.