ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్న ఎస్ఈసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 28, 2020, 12:16 PM

బెజవాడలో బుధవారం కీలక సమావేశం జరగనుంది. రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది. అయితే వైసీపీ ఈ సమావేశానికి గైర్హాజరవుతుందని సమాచారం. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రా ఎన్నికల సంఘం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను  గత మార్చిలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  వాయిదా వేశారు. 


ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం ఏంటని, దీనిపై నవంబర్ 2లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com