అక్రమ సంబంధాలు మానవ సంబంధాలను మంటకలుపుతున్నాయి. కొందరు ఇతరులతో సుఖం కోసం కట్టుకున్న వారిని, కన్న వారిని కడతేర్చిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి మరో ఘటన తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన సొంత పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్లలోపు వయస్సు ఉన్న కుమారుడు, కుమార్తెను మేకులు ఉన్న కర్రతో కొట్టడంతో ఆ చిన్నారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వార్డు సచివాలయంలోని మహిళా పోలీసులు ఆమెను పట్టుకుని స్టేషన్ లో అప్పగించారు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ మహిళకు వివాహం జరిగింది. ఆమెకు పదేళ్ల లోపు వయస్సు కలిగిన ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఆ మహిళ భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని.. సహజీవనం చేస్తోంది.
అయితే తాను ప్రియుడితో గడపకుండా ఆటంకం కలిగిస్తున్నారని కారణంతో సొంత కుమారుడు, కుమార్తెపై ఆమె మేకుల కర్రతో ఇష్టారీతిగా కొడుతూ.. దారుణంగా హిసించడం చేస్తోంది. మంగళవారం సైతం పిల్లలను దారుణంగా కొట్టి ఇంటి నుంచి గెంటేయడానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గమనించి వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు అధికారికి సమాచారం అందించారు. దీంతో ఆ పోలీసు అక్కడికి వచ్చే సరికి ఆ మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.