ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 24, 2020, 09:20 AM

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 26న ఆపన్షల్‌ హాలిడేగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారుర. దసరా ఆదివారం కావడంతో సెలవును సోమవారానికి మార్చాలని సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేయడంతో.. ప్రభుత్వం ఓకే చెప్పింది. మహిళా ఉద్యోగులకు 26న సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరాకి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుపై గందరగోళం ఏర్పడింది. సెలవుపై గందరగోళం ఏర్పడటంతో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. దసరా ఆదివారం రావడవంతో ఆ రోజు ఎలాగూ సెలవే కాబట్టి ప్రత్యేకంగా పండగ సెలవు లేదని భావించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26న దసరా సెలవును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు కేంద్రం 26న ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది. ఏపీ ఉద్యోగులు కూడా కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. మహిళా ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది కాబట్టి... మిగతా ఉద్యోగులు సోమవారం విధులకు రావాల్సి ఉంటుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com