పామర్రులో డ్వాక్రా మహిళల మధ్య డబ్బు వివాదం నెలకొంది. అయితే పంచాయతీ పేరుతో ఓ వర్గానికి స్థానిక వైసీపీ నేత వత్తాసు పలికాడు. ప్రశ్నించిన గాయత్రి అనే మహిళపై వైసీపీ నేత బెదిరింపులకు దిగాడు. అర్ధరాత్రి మహిళ ఇంటిపై దాడి చేసి, చంపుతామంటూ బెదిరించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని గాయత్రి చెబుతోంది. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో మచిలీపట్నంలోని దిశ పోలీస్స్టేషన్ను బాధితురాలు ఆశ్రయించారు.
డ్వాక్రా కింద తమ గ్రూప్కు మూడు లక్షలు మంజూరు అయ్యాయని, తమకు తెలియకుండా కుమారి అనే మహిళ తమ సంతకాలు చేసిందని గాయత్రి చెబుతోంది. ఈ వివాదంపై ఆమెను ప్రశ్నిస్తే .. వైసీపీ నేతలు తనను బెదిరించారని, అసభ్యకరంగా దూషిస్తూ, తన ఇంటికి వచ్చి.. తన పై దాడి చేశారని గాయత్రి వాపోయింది. స్థానిక పోలీసులు స్పందించపోవడంతో దిశ పోలీస్స్టేషన్ను ఆశ్రయించానని గాయత్రి తెలిపారు.