బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న మహిళలపై బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని చేతులతో ఊపిరి పోసుకున్న అమరావతిని సీఎం జగన్ చంపుతుంటే విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారు? అని ప్రశ్నించారు. మహిళ అని గౌరవం లేకుండా వారి వస్త్రధారణ గురించి మాట్లాడుతారా అని పద్మశ్రీ నిలదీశారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మరో ఉత్తరప్రదేశ్ కానుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములు ఇచ్చిన రైతుల ఆవేదన విష్ణువర్ధన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. అమరావతిపై బీజేపీ స్టాండ్ ఏంటి? అని సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు.