ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. అక్టోబర్ 28న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఎన్నికలు వాయిదా పడి 6 నెలలు దాటిన సందర్భంగా మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి మరో 2 నెలల్లో ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగడం ఖాయంగా తెలుస్తోంది.