ఇప్పటి వరకూ దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాల వల్ల కరోనా వచ్చేందుకు అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. అయితే చాలా మందికి కొన్ని లక్షణాలు బహిర్గతం కాకపోయినప్పటికీ కరోనా పాజిటివ్ అని తేలుతోంది. వాసనలను గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడం అనేవి కూడా కరోనా లక్షణాలని గుర్తించారు. కాళ్ల వేళ్లు రంగు మారడం, కందిపోవడం, తాకగానే నొప్పితో విలవిల్లాడటం లాంటివి కూడా కరోనా లక్షణాలేనని యూరప్ పరిశోధకులు తేల్చారు. అయితే మరో దానివల్ల కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. మనం వదలే అవపాన వాయువులు (పిత్తులు) వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందట. దగ్గుతోనే కాదు శరీరం నుంచి బయటకొచ్చే గ్యాస్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో బాంబులేయొద్దని ఆస్ట్రేలియా డాక్టర్ ఆండీ టాగ్ ప్రజలను హెచ్చరించారు. కింది నుంచి గ్యాస్ వదలడం, ముఖ్యంగా దుస్తులు లేనప్పుడు వదలడం వల్ల కరోనా వ్యాప్తిం చెందుతుందని ఆయన తెలిపారు. బాంబులు వేసే టైంలోనూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఆయన సూచించారు.