ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 11:10 AM

వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు అయిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెనుమురు మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో కొండయ్య గారి పల్లి వద్ద వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. అర్ధరాత్రి సమయంలో కారులో వస్తున్న ఓ కుటుంబం వాగులో చిక్కుకొంది. ఆ సమయంలో చుట్టు పక్కల ఎవ్వరు లేకపోవడంతో కారులో ఉన్న ప్రతాప్ అనే వ్యక్తి తోపాటు అతని కుమార్తె  సాయి వినూత వరద  ప్రవాహంలో కొట్టుక పోయారు. కారులోనే ఉండిన మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. గల్లంతు అయిన వారు పుటలపట్టు వాసులు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరోవైపు గల్లంతు అయినవారి కోసం రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com