భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ లో ఎలాంటి మ్యుటేషన్ (జన్యుమార్పు) లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈమేరకు స్పష్టమైనట్టు పేర్కొన్నారు.దేశంలో కరోనా వైరస్ పై ఐసీఎంఆర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు.