ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 16, 2020, 12:55 PM

ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో..ఇతర సంస్థల్లో యూనీఫామ్ విధానాన్ని అమలు చేస్తుంటారు. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల అంతా ఒక్కటేనన్న భావంతో విద్యార్థులు కలిసిమెలిసి ఉంటారని అంతా చెప్తూ ఉంటారు. యూనీ ఫామ్ లో ఆ విధానం అమలులో ఉన్నా పాఠశాలల అటెండెన్స్ రిజిస్టర్లో కులం, మతం నమోదు చేస్తారు. అయితే దీనిపై కాస్త విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల అటెండెన్స్ రిజిస్టర్లో కులం, మతం నమోదు చేసే కాలమ్ ను జగన్ సర్కార్ తొలగించింది.
ఈ అంశంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల మత భేదాలు లేని సమాజానికి సీఎం జగన్ తొలి అడుగు వేశారని ప్రశంసించారు. జగన్ దూరదృష్టికి సలాం చెప్పారు. పాఠశాలల హాజరు పట్టికలల్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మెుదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. ఎందరో మహాత్ములు కలలు కన్న కులమత రహిత సమాజానికి ఇది నాంది అని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com