అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్లో చంద్రబాబు పేరు లేకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం.. స్టేట్ సెక్యూరిటీ కమిషన్లో చంద్రబాబు పేరు నమోదు చేసి నెలలో జీవో ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది