చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో ఓ వివాహిత పురుగుల మందు త్రాగీ మృతి చెందింది. గుర్రంకొండ మండలం పరిధిలోని ఎల్లంపల్లికి చెందిన నాగేశ్వర్ రావు అతని భార్య నాగలక్ష్మిలు కొంత కాలం గొడవ పడుతుండగా భర్తతో గొడవ పడిన నాగలక్ష్మి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.