ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎంపీ యూ టర్న్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 10:36 AM

మాజీ ఎంపీ హర్షకుమార్ యూ టర్న్ తీసుకున్నారు.. తిరిగి సొంత పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమయ్యానని.. త్వరలోనే ఆయన్న కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని.. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దళితులపై దాడులు, శిరో ముండనం కేసులు.. ఇద్దరు దళిత యువకుల్ని పోలీసులు అన్యాయం చంపేశారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే


ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ బీజేపీ మాత్రం పార్లమెంట్ సాక్షిగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ఇటు ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ కూడా హోదాను విస్మరించిందని.. కేసుల మాఫీ కోసం ఢిల్లీలో సాంష్టాంగ పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలన్నారు. త్వరలోనే రాహుల్‌ గాంధీని కలుస్తానని.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వైభవం తీసుకోస్తామని ధీమాను వ్యక్తం చేశారు.


 


రాహుల్ పోరాట పటిమ.. ఈ దేశానికి కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో కూడా దళితుల సమస్యలపై పోరాటం చేస్తానన్నారు హర్ష కుమార్. రాహుల్, ప్రియాంకలు దళితుల పక్షాన చేస్తున్న పోరాటంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని.. బీజేపీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయమన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన పార్టీ అని ఆరోపించారు.. కరోనా కట్టడి విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. కరోనాతో చాలా మంది మృతి చెందుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవాలు ప్రకటించటం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com