ఈ నెల 27వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శ్రీకాకుళం రానున్నట్లు ఆ సంఘం నాయకులు తిరుమల మాదిగ తెలిపారు. శ్రీకాకుళం నగర సమీపంలోని కొత్త రోడ్ల వద్ద ఎంఆర్పిఎస్ నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. దీనికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.