సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన’’ని పేర్కొన్నారు.
కాగా, 50 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఈ శుక్రవారం కన్నుమూశారు. ప్లేబ్యాక్ సింగర్గా, నటుడిగా, మ్యూజిక్ కంపోజర్గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గాంచారు ఎస్పీ బాలు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలోనూ ఆయన పాడిన పాటకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. తమ్ముడు కమల్ హాసన్కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిన 'శుభ సంకల్పం' ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది