ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను రెన్యువల్ చేసేందుకు చర్యలు చేపట్టండి.రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 798 మంది, జూనియర్ కళాశాలలో 3780 మంది తాత్కాలిక అధ్యాపకులుగా ఉన్నారు.గత 6 నెలలుగా వీరికి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే వీరిని రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చినప్పటికీ నేటికి అమలుకు నోచుకోలేదు.ప్రభుత్వ ఉత్తర్వులలో సాంకేతిక లోపం కారణంగా గత విద్యా సంవత్సరం వీరికి 10 నెలల వేతనమే విడుదలైంది.