నీట్ (National Eligibility cum Entrance Test) 2020 ఫలితాలను అక్టోబర్ 12న విడుదల చేసే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మొదలు పెట్టింది. ఈ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ntaneet.nic.in/ లో చెక్ చేసుకోవచ్చు.అలాగే.. NEET UG పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఈ నెల 28న విడుదల చేసే అవకాశముంది. ఆన్సర్ కీ కూడా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. నీట్ 2020 పరీక్ష సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది హాజరయ్యారు.