తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు.అదే మెడిసినల్ ప్లాంట్స్ పెంపకం. వైద్యంలో ఉపయోగించే మొక్కలను పెంచడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. ఆయుర్వేదం కాకుండా అల్లోపతిలో కూడా పలు రకాల మొక్కలను ఉపయోగిస్తుంటారు. దీంతో మెడిసినల్ ప్లాంట్లకు డిమాండ్ కూడా పెరిగింది.శాతవారీ మొక్కల పెంపకంతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని పలు రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. శాతవారీ మొక్కల పెంపకంతో ఎకరాకు రూ.6 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. దీని కోసం రూ.50,000 ఖర్చు పెడితే సరిపోతుంది. శాతవారీ అనేది గ్రేడ్ ఏ మెడిసినల్ ప్లాంట్. ఈ పంట 18 నెలలకు చేతికి వస్తుంది. శాతవారీ మొక్క వేరు నుంచి ఔషధాన్ని తయారు చేస్తారు. వేర్లను బాగా ఎండబెట్టిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 క్వింటాళ్ల వేర్లను ఎండబెట్టిన తర్వాత అవి 3 క్వింటాళ్లు అవుతాయి. ధర అనేది వేర్ల నాణ్యత ప్రాతిపదికన నిర్ణయమౌతుంది.విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఒక ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఒక క్వింటా ధర రూ.50 వేల నుంచి రూ.60 వరకు పలుకుతుంది. పంటను డైరెక్ట్గా ఆయుర్వేదిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు విక్రయించొచ్చు. శాతవారీ ద్వారా ఖర్చులు అన్నీ పోనూ కనీసం రూ.6 లక్షలు పొందొచ్చు.